ఆంధ్రప్రదేశ్కు మరో 20 పోర్టులు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో నదులు, కాలువలు ఎక్కువగా ఉండటంతో పోర్టుల నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా చూస్తామని చెప్పుకొచ్చారు. అలానే త్వరలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మాణం, విశాఖ, విజయవాడకు మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. అంతేకాదు, బుల్లెట్ రైలు ప్రతిపాదనను కూడా మరోసారి తెరపైకి తెచ్చారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..