ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని.. భాష్యం విద్యాసంస్థలు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు విరాళం అందించాయి. ఒకరోజు అన్నప్రసాదం వితరణకు అవసరమయ్యే రూ.44 లక్షలను విరాళంగా అందించాయి. ఈ విరాళంతో ఆదివారం శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం వితరణ జరగనుంది. మరోవైపు బెంగళూరుకు చెందిన భక్తుడు కూడా టీటీడీకి పది లక్షలు విరాళంగా అందించారు.