NFDB Regional Office In Amaravati: కేంద్రం ఏపీ రాజధాని అమరావతికి శుభవార్త చెప్పింది. రాజధానిలో ఎన్ఎఫ్డీబీ (జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్సింగ్ లేఖ రాసినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. అమరావతిలో కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి ఇతర సౌకర్యాలు కాల్పించాలని కేంద్రం కోరిందన్నారు మంత్రి అచ్చెన్న.