ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో అధునాతన లైబ్రరీ నిర్మాణం కోసం శోభా గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా శోభా గ్రూప్ ఛైర్మన్ను చంద్రబాబు అభినందించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని వారిని ఆహ్వానించారు.