ఏపీ సీఎం చంద్రబాబుకు.. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తాజాగా లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో వీరిద్దరి మధ్య సమావేశం జరగ్గా.. దానికి సంబంధించి చంద్రబాబును బిల్ గేట్స్ ప్రశంసించారు. ఏపీ సర్కార్, మైక్రోసాఫ్ట్ కంపెనీ వివిధ రంగాల్లో కలిసి పనిచేయడానికి చంద్రబాబు చూపించిన చొరవను ఆయన అభినందించారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యేందుకు గేట్స్ ఫౌండేషన్ ఆసక్తికనబరచగా.. తాజా లేఖతో త్వరలోనే కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.