చర్లపల్లి సెంట్రల్ జైలులో ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేసేందుకు జైళ్ల శాఖ రెడీ అయింది. నేరం చేసి జైలుకు వచ్చిన ఖైదీలకు శిక్ష విధించడమే కాకుండా.. వారు బయటికి వెళ్లిన తర్వాత ఉపాధి పొంది.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం కోసం ఇలా ఐటీఐ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు సంస్థల ప్రతినిధులతో కలిసి.. చర్లపల్లి జైలులో జైళ్ల శాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించి.. చర్చించారు.