హైదరాబాద్ చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ మంగళవారం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల రాకతో కొత్త శోభను సంతరించుకుంది. సామాన్యులకు తక్కువ ధరలో అత్యాధునిక వసతులు అందించే ఈ ట్రైన్లు శాలిమార్, కామాఖ్య వంటి సుదూర ప్రాంతాలకు ప్రారంభమయ్యాయి. మంగళవారం (ఏప్రిల్ 7) ఒకే సమయంలో రెండు ట్రైన్లు పక్కపక్క ఫ్లాట్ఫారాలపై నిలిచి ఉండటంతో ప్రయాణికులు ఆసక్తిగా తిలకించి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ టెర్మినల్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.