తెలంగాణ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ట్రైన్ జర్నీ చేసేవారికి రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. చర్లపల్లి స్టేషన్ నుంచి అస్సాంలోని ప్రముఖ ఆలయం కామాఖ్య వరకు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడిపేందుకు రెడీ అయింది. ఈ ట్రైన్ మార్చి 13న ప్రారంభం కానుంది. తెలంగాణతో పాటు ఏపీలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.