నిజామాబాద్ జిల్లా సుద్దులం తండాలో విషాదం చోటు చేసుకుంది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని తారాసింగ్ అనే వ్యక్తి అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం జరిగిన విందులో ఈ ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తండాలో విషాదం అలుముకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.