చావులో కూడా వీడని అన్నదమ్ముల అనుబంధం.. అదే వారి చివరి మజిలీ..

10 months ago 27
ఒకే కన్న తల్లి కడుపున పుట్టారు. కలిసి పెరిగారు. చివరికి కలిసి మరణించారు. కన్నీరు తెప్పిస్తున్న ఈ విషాద సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న ఆ అన్నదమ్ములకు అదే చివరి మజిలి అయింది. ఆగి ఉన్న వాహనాన్ని వారు ప్రయాణిస్తున్న కారు డీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు అన్నదమ్ములు మరణించారు. సత్యసాయి జిల్లా నల్లచెరువు సమీపంలో పెద్ద ఎల్లంపల్లి వద్ద జాతీయ రహదారి 42 పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు అన్నమయ్య జిల్లా మదనపల్లి వాసులుగా గుర్తించారు.
Read Entire Article