చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ కళాకారుడు అద్భుతం సృష్టించారు. 50 వేల చింతగింజలతో విరాట్ కోహ్లీ చిత్రాన్ని రూపొందించారు. చింతగింజలతో స్పైరల్ ఆర్ట్ని యువ కళాకారుడు పురుషోత్తం వేశారు. క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఉన్న అభిమానంతోనే చిత్రం వేశానన్నారు పురుషోత్తం. పురుషోత్తం కళ నైపుణ్యంపై విరాట్ కోహ్లీ అభిమానుల ప్రశంసలు. పురుషోత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.