బిర్యానీ అంటే నాలుక కోసుకునే భోజన ప్రియులు.. ఇప్పుడు ఆ బిర్యానీనే తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. బిర్యానీ తినేటప్పుడు మధ్యలో చికెన్ ముక్కలో, మటన్ ముక్కలో కాకుండా బొద్దింకలు, పురుగుల అవశేషాలు కూడా కనిపిస్తుండటం జనాలకు జుగుప్స కలిగిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ రెస్టారెంట్లో ఓ కస్టమర్ బిర్యానీ తింటుండగా.. మధ్యలో బొద్దింక రావటంతో కక్కలేక, మింగలేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు.