తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్, ఉగాది పండగ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల ఇంతకంటే ఎక్కువ ధరకూ చికెన్ విక్రయాలు చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో గత వారం వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా.. పండగ నేపథ్యంలో ధరలు మళ్లీ పెరిగాయి.