హైదరాబాద్ చిక్కడపల్లిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వివేక్ నగర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో దొంగతనం చేసిన కర్ణాటకకు చెందిన బ్రూస్లీ, ఖమ్మం జిల్లాకు చెందిన సాయికుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 28 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే బ్రూస్లీ ఈ చోరీకి పాల్పడ్డాడు.