పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధికార ప్రతినిధి గాయత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ ట్విట్టర్ స్పేస్లో రామాయణ, మహాభారతాలపై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ నెటిజన్లు ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించారని గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇంతకూ ఏం జరిగింది అంటే..