చిత్తూరు మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు .. నగర వీధుల్లో నడిపిస్తూ తీసుకెళ్లి కోర్డులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. అనంతరం జైలుకు తరలించారు. అయితే నగరవనానికి వెళ్లిన బాలికపై ముగ్గురు అత్యాచారం చేయడం స్థానికంగా సంచలనం రేపింది.