Chenab Bridge Telugu Engineer Madhavi Latha: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం జరిగింది. తెలుగు మహిళ గాలి మాధవీలత ఈ ప్రాజెక్టులో 17 ఏళ్లుగా కన్సల్టెంట్గా పనిచేయడం విశేషం. ఆమె రాక్ మెకానిక్స్లో నిపుణురాలు. కొండలు, రాళ్ల స్వభావంపై పరిశోధనలు చేశారు. వందేళ్ల కల నెరవేరిందని, ఈ ప్రాజెక్టులో భాగం కావడం గర్వంగా ఉందని ఆమె అన్నారు. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉండటం విశేషం.