చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. చిన్నతనం నుంచే గుండె కవాట సమస్యతో బాధపడుతున్న ఆయన.. మినిమల్లీ ఇన్వాసివ్ పద్ధతిలో ఏవోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత ఉత్సాహంగా బయటకు వస్తానని, త్వరలోనే పార్లమెంట్ సెషన్స్కు హాజరవుతానని తెలిపారు.