Student Attacks Teacher In Vizianagaram: ఆరేళ్ల క్రితం మందలించిన టీచర్పై కక్ష పెంచుకున్న విద్యార్థి, మళ్లీ మళ్లీ దాడికి ప్రయత్నిస్తున్నాడు. విజయనగరం జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం స్కూల్ టీచర్ చదువుకోమని మందలించారు. అప్పటి నుంచి ఆ విద్యార్థి టీచర్పై పగ పెంచకున్నాడు. గత ఏడాది కత్తితో దాడి చేసిన యువకుడు, తాజాగా మరోసారి హెడ్మాస్టర్ను అడ్డగించాడు. పోలీసులు యువకుడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు.