చెత్త, వ్యర్థ నివారణపై ఫైన్ విధించే జీహెచ్ఎంసీకి.. భారీ జరిమానా.. ఎందుకంటే..

7 months ago 20
చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జీహెచ్ఎంసీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.1 లక్ష జరిమానా విధించింది. నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను నియమాలను పట్టించుకోకుండా జవహర్‌నగర్‌లో డంప్ చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు, వ్యాపారులు చెత్త వేస్తే జరిమానాలు వేస్తున్న జీహెచ్ఎంసీకి ఇప్పుడు తానే జరిమానా పడింది. చెత్త, వ్యర్థాల నిర్వహణలో క్రమబద్ధత పాటించి, పర్యావరణానికి హాని కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article