చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జీహెచ్ఎంసీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.1 లక్ష జరిమానా విధించింది. నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను నియమాలను పట్టించుకోకుండా జవహర్నగర్లో డంప్ చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు, వ్యాపారులు చెత్త వేస్తే జరిమానాలు వేస్తున్న జీహెచ్ఎంసీకి ఇప్పుడు తానే జరిమానా పడింది. చెత్త, వ్యర్థాల నిర్వహణలో క్రమబద్ధత పాటించి, పర్యావరణానికి హాని కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.