Vizianagaram TDP MP Kalisetti Appalanaidu On Chennai Sanitation Worker Padama: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెన్నైకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు తీసుకెళ్తానన్నారు. పద్మకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలంటూ ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. అంతేకాదు ఇటీవల పద్మతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.. ఆమె నిజాయితీని అభినందించారు. ఆమెకు ఇటీవల ఓ బంగారం ఉన్న బ్యాగ్ దొరికింది.. ఆమె ఆ బ్యాగ్ను జాగ్రత్తగా యజమానికి అందేలా చూశారు.