CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంఛార్జ్ మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను వారిదే అని చెప్పారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలన్నారు. బూత్ స్థాయి నుంచతి పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేలా నాయకులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.