హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల రక్షణపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. మాదాపూర్లోని తమ్మిడికుంట, సున్నం చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. ఆక్రమణల తొలగింపు, సుందరీకరణ పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువుల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని అంగుళం కూడా వదలకుండా స్వాధీనం చేసుకోవాలని రెండు నెలల్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.