Tenali Woman Donated Gold Bangles Money: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వెలగపూడి సచివాలయంలో పలువురు సామాన్యులు కలిశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇద్దరు వృద్ధులు ఉదయలక్ష్మి, చంద్రావతి విరాళాలు అందజేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ముందుందని, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.