చేనేతలకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం..

1 month ago 9
ఏపీ ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ వినిపించింది. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన థ్రిఫ్ట్ ఫండ్‌కు ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత థ్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. 5,726 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేలా రూ.1.67 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఇటీవలే ఆప్కో బకాయిలను సైతం విడుదల చేసిన విషయాన్ని ఏపీ చేనేత, జౌలి శాఖ మంత్రి సవిత గుర్తు చేశారు. చేనేత రంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
Read Entire Article