రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో సీఐ శ్రీధర్ జేసీబీ యంత్రం కింద పడి గాయపడ్డారు. ప్రభుత్వం మృతులకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించింది.