చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. భారీ వాహనాల యజమానులను కూడా ప్రమాదాలకు బాధ్యులను చేసేలా నిబంధనలు మార్చాలని యోచిస్తోంది. వాహనాల నిర్వహణ, డ్రైవర్ల విశ్రాంతిపై యజమానులు శ్రద్ధ వహించేలా ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నారు. ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లకు పునశ్చరణ తరగతులు తప్పనిసరి చేయాలని కూడా పరిశీలిస్తున్నారు.