రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాష్ట్ర హెచ్ఆర్సీ రంగంలోకి దిగింది. ఈ బస్సు ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ.. పలు శాఖల కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన నివేదికను వచ్చే నెల 15 లోపు సమర్పించాలని ఆదేశించింది. ఇక అతి వేగంతో వచ్చిన టిప్పర్.. బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది దుర్మరణం చెందగా.. మరో 25 మంది గాయాలపాలయ్యారు.