చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు యజమాని మితిమీరిన లాభాపేక్ష కారణమని పోలీసులు తేల్చారు. అధిక లోడ్తో, రాంగ్ రూట్లో అతివేగంగా వెళ్లటానికి.. టిప్పర్ యజమాని లచ్చు నాయక్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఓవర్లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.