రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సెలవు ముగియడంతో హైదరాబాద్లోని హాస్టల్కు బయలుదేరిన వీరు, ట్రైన్ మిస్ అవ్వడంతో బస్సు ఎక్కారు. ఆ పది నిమిషాల ఆలస్యమే వారి ప్రాణాలు తీసింది.