రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో 17 మంది మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.