సమాజానికి రక్షకులుగా నిలవాల్సిన పోలీసులు తప్పుదారిలో నడవడం ఆందోళనకరం. సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ కృష్ణంరాజు వరుస పెళ్లిళ్లు, మైనర్ బాలికతో వివాహం, బెదిరింపులు వంటి ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. మరో ఘటనలో ఎస్సై ప్రవీణ్కుమార్ మహిళా సహోద్యోగిని వేధించిన సంఘటన వెలుగులోకి రావడంతో చర్యలు తీసుకున్నారు. ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సినవారు ఇలాంటివి చేయడం విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి ఘటనలు జరగకుండా.. పోలీసులంటే ప్రజలకు చులకన భావం రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.