ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కల్తీ నెయ్యి దందా కలకలం రేపుతోంది. పిఠాపురం కేంద్రంగా జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేసి కొవ్వును గుర్తించారు. అనంతరం నమూనాలు.. ఆహార నియంత్రణ విభాగానికి పంపించారు. అయితే జంతు కొవ్వు కలిసిన ఈ కల్తీ నెయ్యి వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.