జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే పదవి ఎందుకు రాజీనామా చేయాలి: కేఏ పాల్

1 year ago 13
అసెంబ్లీ కి జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండటం చాలా విచారమన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అసెంబ్లీకి వెళ్లనప్పుడు వైఎస్సార్‌సీపీ 11 మంది ఎమ్మెల్యే లు రాజీనామా చేయాలని.. లేకపోతే ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లి పోరాడాలన్నారు. ప్రజాశాంతి పార్టీ కి ఒక్క ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా ప్రజల సమస్యల పై నిరంతరం పోరాడుతున్నామన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంంలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అన్నారని.. ఇప్పడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కి సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేతకాదని విమర్శించారు. పవన్ రాజకీయాలకు పనికిరారని.. కూటమి ప్రభుత్వం కోట్ల అప్పులతో రాష్ట్రం సర్వనాశనం అవుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీ తోనే సాధ్యమని.. తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీలు మోదీ కి తొత్తులన్నారు.
Read Entire Article