జగన్ ఆ పేరును సుస్ధిరం చేశారు.. ఏపీ మంత్రి సెటైర్లు

1 year ago 22
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ విధ్వంసం గురించి మాట్లాడటం ఈ శతాబ్దపు విడ్డూరమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్‌ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఆయన కంటే తుగ్లక్‌ మేలని ప్రజలు అభిప్రాయపడ్డారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. భవిష్యత్‌లోనూ తుగ్లక్‌ బదులుగా జగన్‌ పేరును వాడుకునే విధంగా పాలించారని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను పీల్చి పిప్పిచేశారని, కీలకమైన పోలవరం ప్రాజెక్టును ముంచేశారని ఆరోపించారు. అలాంటి వైఎస్ జగన్‌ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని నిమ్మల రామానాయుడు విమర్శించారు.
Read Entire Article