జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాల్సిందే.. వైవీ డిమాండ్

1 year ago 26
కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, మిర్చి రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లిన జగన్‌కు భద్రత ఇవ్వకుండా హానితలపెట్ట విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసి.. న్యాయపోరాటం చేస్తామన్నారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని దుయ్యబట్టారు.
Read Entire Article