Mp Sri Bharat On Chandrababu Ys Jagan Tours: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వైఎస్సార్సీపీ అడ్డుకుంటోందని విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ మండిపడ్డారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి ఖర్చు చేసిన డబ్బుతో ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఉండేవారని విమర్శించారు. పెట్టుబడిదారుల సదస్సులో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వైఎస్సార్సీపీ నేతలు విధ్వంసం చేయడంలో పీహెచ్డీ చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు, జగన్ పర్యటనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.