పార్వతీపురం జిల్లాలోని పాలకొండలో గురువారం పర్యటించిన మాజీ సీఎం జగన్.. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులు పాలకొండ తరలివచ్చాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే జగన్ క్రేజ్ అంటూ.. ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేని ఫొటోను ఎక్స్ యూజర్ ఒకరు పోస్టు చేశారు. అసలు ఆ ఫొటో ఎక్కడిదో చూద్దాం..