టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. మాజీ సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులు ఉన్న జగన్కు బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్కు దేవుడిపై నమ్మకం ఉంటే.. చేసిన తప్పులు ఒప్పుకుని జైలుకు వెళ్లాలని పేర్కొన్నారు. జగన్ జైలులో కాకుండా బయట ఉంటే ప్రమాదమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 12 ఏళ్లు బెయిల్ మీద బయటికి వచ్చి.. రాష్ట్రాన్ని రాక్షస పాలనతో విధ్వంసం చేశారని మండిపడ్డారు.