AP Fish Andhra Shops Salons: గత ప్రభుత్వ హయాంలో కాకినాడ జిల్లాలో 'ఫిష్ ఆంధ్ర' పేరుతో సముద్ర ఉత్పత్తుల అమ్మకాల కోసం షాపులు ఏర్పాటు చేశారు. రాయితీపై ఇచ్చిన ఈ షాపులను కొందరు ఇతర వ్యాపారాలకు మార్చేశారు. ప్రస్తుతం చాలా దుకాణాల్లో టీ కొట్టులు, సెలూన్లు, జిరాక్స్ సెంటర్లు వెలిశాయి. రాయితీ పొందిన తర్వాత షాపుల్ని నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.