జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయన పార్టీ మారారంటూ దాఖలైన పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారంటూ పిటిషన్ దాఖలు కాగా.. అందుకు తగిన ఆధారాలు లేవంట్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది.