తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించి పార్టీ వర్గాలకు, కార్యకర్తలకు, అభిమానులకు షాకిచ్చారు. అయితే తన బదులు తన భార్య నిర్మల సంగారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని తెలిపారు. పదేళ్ల తర్వాత మళ్లీ పోటీ చేస్తానని, ఈ పదేళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దసరా వేడుకల్లో ఈ నిర్ణయం వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. యువతకు డ్రగ్స్, అతివేగంపై హెచ్చరికలు చేశారు. ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.