Jadcherla Govt Hospital Scary Incident: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత ఆస్పత్రిలో హృదయ విదారక ఘటన జరిగింది. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని వీధి కుక్క పీక్కుతిన్న ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి చెరువులో పడి చనిపోయాడు.. అతడి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం మార్చురీకి తరలించారు. అయితే అక్కడ మృతదేహాన్ని ఓ కుక్క పీక్కుతినింది. వెంటనే కొందరు గమనించి కుక్కను తరిమేశారు. ఈ సీన్ మొత్తాన్ని వీడియో తీయగా వైరల్ అయ్యింది.