మహబూబ్నగర్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు లారీని ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ముగ్గురు మరణించగా.. 18 మందికి గాయాలయ్యాయి.