జనగణనలో ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలు జవాబులు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రశ్నలు అడిగే అధికారం ఎన్యూమరేటర్లకు ఉందని.. అయితే సమాధానాలు ఇచ్చేందుకు నిరాకరిస్తే.. జరిమానా విధించనున్నట్లు తెలిపింది. అదే సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు రుజువైతే జైలు శిక్ష విధించనున్నారు. మరోవైపు.. ఎన్యుమరేటర్లు విధులను తిరస్కరించినా, ఇతరులకు ఆటంకాలు కలిగించినా జరిమానా, జైలుశిక్ష తప్పవని హెచ్చరించింది.