ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగు చూస్తున్నాయి. మోసపోయే వారు ఉన్నంత వరకు మోసం చేసే వారు పుట్టుకొస్తూనే ఉంటారు. మాయ మాటలకు నమ్మితే ఒంటిపై బట్టల్ని కూడా మాయం చేస్తారు. తాజాగా.. జనగామ జిల్లా కేంద్రంలో ఓ కేటుగా టిప్పు సుల్తాన్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. టిప్పు సుల్తాన్ తన తాత గారని.. తాను వారి వారసుడినంటూ రూ. 5 కోట్లకు పైగా డబ్బుతో ఉడాయించాడు.