వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ శివారులో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవల రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరగడం ఆందోళన కలిగిస్తోంది.