జనసేన ఎమ్మెల్యే మీటింగ్‌కు వైసీపీ నేత.. ఆ జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

1 year ago 21
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ కార్యక్రమంలో వైసీపీ నేత ప్రత్యక్ష్యమయ్యారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో రాజోలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాపాక వరప్రసాద్ రావు కనిపించారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాపాక వరప్రసాద్ పార్టీ మారుతారుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే నియోజకవర్గంలోని పనుల గురించి చర్చించేందుకే వెళ్లినట్లు రాపాక వరప్రసాద్ రావు స్పష్టం చేశారు.
Read Entire Article