అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ కార్యక్రమంలో వైసీపీ నేత ప్రత్యక్ష్యమయ్యారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో రాజోలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాపాక వరప్రసాద్ రావు కనిపించారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాపాక వరప్రసాద్ పార్టీ మారుతారుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే నియోజకవర్గంలోని పనుల గురించి చర్చించేందుకే వెళ్లినట్లు రాపాక వరప్రసాద్ రావు స్పష్టం చేశారు.