Police Case On Janasena Party Leader Bhairava Prasad: కదిరి జనసేన పార్టీ నేత భైరవ ప్రసాద్పై కేసు నమోదైంది. తన భర్త కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని.. అతనికి ఉన్న అలవాట్ల గురించి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై తనపై దాడి చేశాడని భైరవ ప్రసాద్ భార్య శశికళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తలతో పాటు శరీరంలోని పలుచోట్ల ఐరన్ రాడ్తో కొట్టి గాయపరిచాడని ఆమె ఆరోపించారు. అడ్డుకునేందుకు వచ్చిన తన కూతురు సాయి వర్షినిపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీసులు ప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.