రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. జనసేన విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అరవ శ్రీధర్ మీద మహిళ ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు హాజరైన అరవ శ్రీధర్.. తన వివరణ తెలియజేశారు. అయితే సమావేశం మధ్యలోనే అరవ శ్రీధర్ బయటకు వచ్చినట్లు తెలిసింది. తన వివరణ, వివరాలు అన్నీ అందించానని.. పార్టీ అన్నీ చూసుకుంటుందంటూ అరవ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.